తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Published: Friday June 03, 2022
మధిర జూన్ 2 రూరల్ ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు టిడిపి కార్యాలయంలో
ఘనంగా నిర్వహించారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు *డాక్టర్ వాసిరెడ్డి రామనాథం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు* వేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి జండా వందనం గావించారు డాక్టర్ *బాబాసాహెబ్ అంబేద్కర్* చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు, టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, రాష్ట్ర కార్యదర్శి మేడేపల్లి రాణి. కౌన్సిలర్ వంకాయలపాటి వెంకటనాగేశ్వరావు.సీనియర్ నాయకులు రావి కోటేశ్వరరావు ,పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు వంగాల రామకోటి, నాయకురాలు మన్నెపల్లి రత్నకుమారి, మేడ వెంకటేశ్వర్లు,వట్టికొండ నాగేశ్వరావు, నాగులవంచ శ్రీనివాసరావు, వట్టికొండ రామోహనరావు ,బోనాలు ప్రసాద్. చట్టు వెంకటేశ్వరరావు, రాయప్ప,తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: