శంకరపట్నంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

Published: Friday April 14, 2023
శంకరపట్నం ఏప్రిల్ 13 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మహిళా అభివృద్ధి - శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తాహాసిల్దార్ గూడూరు సత్యనారాయణ రావు అధ్యక్షతన బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండని అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేయరాదని, అలా పెళ్లి చేసిన వారిపై  బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం  చర్యలు విధించబడతాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కాజాబషీరుద్దీన్, డిసిపిఓ పి.శాంత, ఐసిడిఎస్ సూపర్వైజర్ స్రవంతి, సంబంధిత శాఖ అధికారులు పి.తిరుపతి, రమేష్ లు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు పురోహితులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.