గొల్లపల్లి మండలకేంద్రంలో ఆర్టీఐ- 2005 ప్రచార సమితి సమమావేశం

Published: Saturday May 08, 2021
గొల్లపల్లి, ఏప్రిల్ 07 ప్రజాపాలన ప్రతినిధి) : ​గొల్లపల్లి మండలం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో​సమాచార హక్కు చట్టం 2005 ప్రచార సమితి​గొల్లపల్లి మండలకేంద్రంలో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు అంకం భూమయ్య ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఏర్పుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అని. ప్రజలకు ఏవైనా సమస్యలుంటే మా దృష్టికి తీసికురావలని చెప్పారు. సామాన్యుడు ప్రశ్నించినప్పుడే మార్పు సాధ్యమవుతుందని తెలియజేసారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ హజరయి చట్టం అమలుకు పూర్తిస్థాయిలో వివరిస్తూ మరియు ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులుగా అంకం భూమయ్య కార్యదర్శిలుగా చౌటుపల్లి రఘునందన్ ధర్మపురి నియోజవర్గ కార్యదర్శిగా నియామక పత్రం అందజేయడం జరిగినది. బాద్యులకు ​ఐడి కార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఈ యాదగిరి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ ఖరిము ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సంపత్ భువనగిరి నియోజకవర్గ అధ్యక్షులు గుజ్జ శివకుమార్, గొల్లపల్లి భోదనపు శ్రీనివాస్ పాల్గొన్నారు.