హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ను కలిసిన.... అందెల

Published: Friday July 23, 2021
బాలాపూర్, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : దత్తాత్రేయ లాంటి మహోన్నత వ్యక్తులు తనకు ఆదర్శమని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జి అందెల పేర్కొన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ను మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లో కలిసి శాలువాతో సన్మానించిన  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా తనదైన ప్రతిభ కనబర్చటంతో... రెండోధపా హర్యానా రాష్ట్రానికి కేంద్రం ఎంపిక చేయటం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ..... పదవులను వృత్తి, బాధ్యతగా భావించే దత్తాత్రేయ లాంటి మహోన్నత వ్యక్తులు తనకు ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ ని రాష్ట్ర నాయకులు ఎల్మేటి దేవేందర్ రెడ్డి, తుమ్మలూరు ఎంపీటీసీ రాంరెడ్డి, మోహబత్ నగర్ బీజేపీ నాయకులు శ్రీరాములు యాదవ్, వార్డు సభ్యులు రఘువీర్ కలిసి  సన్మానించారు.