దుర్గామాత ఆలయ నిర్మాణానికి రూ.51వేల విరాళం

Published: Tuesday February 21, 2023
లక్షెట్టిపేట, ఫిబ్రవరి 20, ప్రజాపాలన:
జిన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆ గ్రామాస్తులు చేపడుతున్న దుర్గా మాత 
ఆలయ నిర్మాణానికి లక్షెట్టిపేటకు చెందిన ప్రముఖ వ్యాపారి మైలారపు శంకరయ్య, ఆయన కుమారులు శ్రీనివాస్, సుధాకర్ లు రూ.51వేల విరాళాన్ని సోమవారం అందజేసి తమ దైవ భక్తిని చాటుకున్నారు. ఆలయ నిర్మాణానికి విరాళాన్ని అందజేసిన ఈ దాతలకు గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి సహకరించాలని సర్పంచ్ కోరారు.