కోటి 80లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులను పరిశీలిస్తున్న జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి - ప్రజాపాలన (జనవరి 20) : హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల కృషి చేస్తామని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ . హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో హుడా కేఫ్ నుండి చందనగర్ గాంధీ విగ్రహం వరకు రూ.1కోటి 80లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులను స్థానిక ప్రజలు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, నాయకులు రాజేందర్, భగత్, హాఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ ఎస్.సి సెల్ అధ్యక్షులు కంది జ్ఞానేశ్వర్, విష్ణు, వర్క్ ఇంస్పెక్టర్లు మల్లేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: