పట్లూరు హనుమాన్ మందిర నిర్మాణానికి రూ.1,01116 విరాళం

Published: Saturday February 11, 2023
* మర్పల్లి మండల జడ్పీటీసీ మధుకర్ 
వికారాబాద్ బ్యూరో 10 ఫిబ్రవరి ప్రజాపాలన : మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ మందిర నిర్మాణానికి 1,01,116 రూపాయలు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ దేవరదేశి అశోక్ ఆధ్వర్యంలో విరాళంగా అందజేశానని మర్పల్లి మండల జడ్పిటిసి మధుకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన అలవాడేందుకే దేవాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. నేటి యాంత్రిక జీవన పోరాటంలో మనిషి ఒక యంత్రంలా తయారయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. యంత్రంలా పనిచేసే మనిషికి కాస్తయినా సమయము దొరికితే ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల వైస్ ఎంపిపి మోహన్ రెడ్డి, పట్లుర్ గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్, సీనియర్ నాయకులు కోటమర్పల్లి రాచన్న, శ్రీనివాస్, మర్పల్లి బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గఫార్ మిత్రులు పట్లూర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.