నేషనల్ టాలెంట్ సర్చ్ ఎక్జామినేషన్ లో సత్తా చాటిన విద్యార్థిని నిత్య

Published: Thursday June 17, 2021

సిద్ధిపేట (ప్రజాపాలన ప్రతినిధి) : జాతీయ వ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించే పోటీ పరీక్ష నేషనల్ టాలెంట్ సర్చ్ ఎక్జామినేషన్ (ఎన్ టి ఎస్ ఈ) లో సిద్ధిపేట విద్యార్థులు సత్తా చాటారు. నిన్న విడుదలైన ఎన్ టి ఎస్ ఈ 2021 ఫలితాలలో ఈ.నిత్య తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు ను కలిసిన విద్యార్థిని నిత్య, ఆమె తండ్రి రమేష్ ను మంత్రి అభినందించారు. మంత్రి మాట్లాడుతూ సిద్ధిపేట విద్యార్థులు ఇలా రాష్ట్ర స్థాయిలో ర్యాంకు లు సాధించడం హర్షణీయం అన్నారు. నిత్య శ్రీచైతన్య స్కూల్ విద్యార్థిని కావడం విశేషం.