ఉపాధి హామీతో గ్రామార్థికాభివృద్ధి : వికారాబాద్ ఎంపిడిఓ మల్గ సత్తయ్య

Published: Wednesday March 09, 2022
వికారాబాద్ బ్యూరో 08 మార్చి ప్రజాపాలన : ఉపాధి హామీతో గ్రామ ఆర్థికాభివృద్ధి చెందుతుందని వికారాబాద్ ఎంపిడిఓ మల్గ సత్తయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని రాళ్ళచిట్టంపల్లిలో గ్రామ సర్పంచ్ ముఫ్ల యాస్మిన్ గౌస్, పంచాయతీ కార్యదర్శి సుప్రియలతో కలిసి ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఉపాధి హామీ కార్డు పొందిన ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. అధికారులు సూచించిన కొలతల ప్రకారం అప్పగించిన పనులు చేసిన వారికి పూర్తి కూలీ లభిస్తుందని స్పష్టం చేశారు.