మున్సిపాలిటీ పరిధిలోపరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి మున్సిపల్ చైర్మన్ మొండితోక లత

Published: Saturday October 29, 2022

మధిర  ఫిబ్రవరి 15 (ప్రజా పాలన ప్రతినిధి) ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత కమిషనర్ అంబటి రమాదేవి కోరారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 13 మరియు 17 వార్డుల్లో వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి సీజనల్ వ్యాధులు దరి చేరవన్నారు. రహదారులపై చెత్త వేయవద్దని మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త బండి వచ్చినప్పుడు  ప్రజలు చెత్త వేయాలన్నారు. రహదారులపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని వారు తెలిపారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు అందరూ సహకరించాలని వారు కోరారు. ప్రజలు పాలకమండలి సహకారంతో  మధిర మున్సిపాలిటీని  అన్ని రంగాల్లో అభివృద్ధి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.