కులం పేరుతో దూషించిన వారిపై కేసు నమోదు: ఎస్సై తేజావత్ కవిత
Published: Wednesday May 25, 2022
బోనకల్, మే 24 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ గ్రామానికి చెందిన చేపల మడుగు అరుణ కుమారుడిని అదే గ్రామానికి చెందిన కోయినేని ప్రదీప్,రావుట్ల సత్యనారాయణ, విజయ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కులం పేరుతో ధూషిస్తూ చేతులతో ,చెప్పులతో అతని శరీరంపై, కాళ్లపై కొట్టారు. అంతేకాకుండా అతనిని బెదిరించారు. ఈ సంఘటన ఈనెల 19 వ తేదీన సాయంత్రం ఏడు గంటలకు జరగగా, 23వ తేదీన ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగినప్పుడు బాధితుడు బ్రిడ్జి కింద కూర్చొని ఆల్కహాల్ తీసుకుంటున్నాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదు.
పైన పేర్కొన్న ముగ్గురిపై క్రైమ్ నెంబర్ 106 బై 22 అండర్ సెక్షన్ 294 b, 323, 324, 506, r/w 34 ipc, సెక్షన్ 3 (1) (r) (s) ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయబడింది.
Share this on your social network: