కోరికలు తీర్చే అమ్మవారికి బోనంసమర్పించుకున్న కార్పొరేటర్

Published: Tuesday October 12, 2021
బాలాపూర్: అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : మీర్ పేట్ లోనీ బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పాత బస్తీ లో ప్రతి సంవత్సరం అషాడమాసం చివరి లో లేదా శ్రావణమాసం మొదటి వారం ప్రారంభంలో జరగవలసిన బోనాల పండుగ పోచమ్మ గుడి నిర్మాణంలో ఉండటంతో పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిందినీ అన్నారు. గుడి నిర్మాణం పనులు పూర్తి కావటానికి ఇంకా సమయం పడుతుండడంతో బోనాల పండుగనూ గ్రామ పెద్దలు ఈ ఆదివారం జరపాలని నిర్ణయించారు. మీర్ పేట పాత గ్రామం ప్రజలు పలు కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు బోనాలను అమ్మవారికి సమర్పించుకున్నారు. 45వ డివిజన్ కార్పొరేటర్ అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్ బోనం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పోచమ్మ దేవత అమ్మవారికి సమర్పించుకున్నారు. కాలనీవాసులతో స్థానిక కార్పొరేటర్ అక్కి మాధవి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకున్నారు. వచ్చే బోనాల పండుగ లోపు గుడి నిర్మాణం పూర్తి కావాలని పండగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రజలందరూ సుఖ శాంతులతో అయు ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.