సీఎం కేసీఆర్ తోనే సంక్షేమ పాలన సాధ్యం

Published: Monday April 10, 2023
ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి
మేడిపల్లి, ఏప్రిల్ 9 (ప్రజాపాలన ప్రతినిధి)
సీఎం కేసీఆర్ తోనే సంక్షేమ పాలన సాధ్యమని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.
రామంతాపూర్ డివిజన్ ఇందిరా నగర్ లోని పద్మశాలి భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్, రామంతాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ముస్తాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి ప్రతీ కాలనీలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిలోను కనిపిస్తున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకం అని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో  మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్,  
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనం పల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, రేపాక కుమారస్వామి,తిప్పని సంపత్,   ప్రధాన కార్యదర్శి జేసిబి రాజు,   రహమాన్, సీమ అశోక్, జంగయ్య ,మహేందర్, గుండం మధు, రత్నం, డాన్ శీను , జక్రియ, బాలకృష్ణ, నారాయణస్వామి  ప్రశాంత్, అద్వైత్ రెడ్డి, కిట్టు , అశోక్, డి.జే సాయి,  అద్వైత్ రెడ్డి, భాగ్యరేఖ,  మంజుల , పద్మ , సబిత  , మహిళలు  నాయకులు, కార్యకర్తలు, మహిళలు,పార్టీ శ్రేణులు , కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు , తదితరులు పాల్గొన్నారు.