రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సారధ్యంలో టిఆర్ఎస్ తోనే నా ప్రయాణం -మళ్లీ తెరాస గూటికి

Published: Thursday September 22, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
బూర్గంపాడు: రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సారధ్యంలో టిఆర్ఎస్ తోనే నా ప్రయాణమని చుక్కపల్లి బాలాజీ స్పష్టం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెరాస పార్టీలోనే ఉన్నానని బిజెపి మాజీ మండలాధ్యక్షుడు చుక్కపల్లి బాలాజీ వెల్లడించారు  .ఈనెల 16న మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బూర్గంపహాడ్ జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, మండల తెరాస నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో తాను తెరాస లో చేరానని వివరించారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అని తెలిపారు . మరుసటి రోజు బిజెపి జిల్లా నాయకులు కోనేరు చిన్ని మాట్లాడడం జరిగింది. తన ప్రమేయం లేకుండానే  పార్టీ కండువా కప్పుకోవడం జరిగిందని అన్నారు. తాను తెరాస పార్టీలోనే ఉన్నానని తనకు బిజెపికి సంబంధం లేదని అభివృద్ధికి ఆకర్షితమై తెరాస పార్టీ లో చేరడం జరిగిందని పునరుద్ఘాటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ మారనని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న తెరాస పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు