తెలంగాణ చరిత్రను మలుపు తెప్పిన, సోనియమ్మ. నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నం నిజం చేసిన త్యా

Published: Saturday December 10, 2022

చేవెళ్ల డిసెంబర్ 09 (ప్రజా పాలన):-

శ్రీమతిసోనియాగాంధీ గారి వల్లే ప్రత్యేక తెలంగాణ  కల సాకారం, అయిందని,
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిటిసి గుండాల రాములుఅన్నారు.
యుపిఏ మాజీ చైర్ పర్సన్ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చేవెళ్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది విద్యార్థుల ఆత్మబలిదానాలు చూడలేక 60 ఎండ్ల తెలంగాణ చిరకాల స్వప్నం నిజం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని, రానున్న ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు.ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ  సోనియా గాంధీ త్యాగం చేశారని కొనియాడారు. మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల ఆశయ సాధన కోసం సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. సోనియాగాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిలు మహేశ్వరు రెడ్డి, పెంటయ్య గౌడ్,మండలపార్టీ ఉపాధ్యక్షులు పాండుయదవు,సత్యనారాయణ, మాజీ సర్పంచులు దావల్ గారి గోపాల్ రెడ్డి, బాలయ్య, చేవెళ్ల  ఉప సర్పంచ్ గంగి యాదయ్య, ముడిమ్యాల పిఎసిఎస్ డైరెక్టర్ పడాల రాములు, నాయకులు మునూరు జనార్దన్,మల్కాపూర్ గోపాల్ రెడ్డి,హనీఫ్,ప్రభాకర్ గౌడ్, దేవేందర్,సోషల్ మీడియా మాణిక్యం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు