మధిర వాసులు తస్మాత్ జాగ్రత్త: ప్రభుత్వ వైద్యులు ఎం డిఅనిల్ కుమార్
Published: Wednesday July 13, 2022
మధిర జూలై 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ*వర్షాలకు వరదలు కారణంగా వ్యాధులు పెరిగే అవకాశం ఉందా డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారుఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో.మధిర లో కూడా వర్షాలు, వరదల కారణంగా వ్యాధులు పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు ప్రభుత్వ వైద్యులు ఎండి అనిల్ కుమార్ సూచించారు. 'వరద నీటిలో ఎక్కువగా తిరగొద్దు. దీంతో చర్మ వ్యాధులు వచ్చే చాన్స్ ఉంది. ఎక్కువగా వర్షంలో తడిస్తే జలుబు, జ్వరం బారీన పడతారు. ఇవే సీజనల్ జ్వరాలకు దారి తీస్తాయి . ఏ మాత్రం లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గర లో ఉన్న పి హెచ్ సిల్లో చూయించుకోండి అని తగు జాగ్రత్తలు తెలిపారు.
Share this on your social network: