నిరు పేద కుటుంబాలకు అండగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్

Published: Wednesday May 18, 2022

కోరుట్ల, మే 17 ( ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి  చెందిన ఇల్లందుల కొండ స్వామి  అనారోగ్యం తో దుబాయ్ లో మరణించిన సమాచారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ మెట్ పల్లి సభ్యులు తెలుసుకొని ఆర్థికంగా బాధపడుతున్న ఇల్లందుల కొండ స్వామి కుటుంబాన్ని పరామర్శించి  నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందిచారు.ఈ కార్యక్రమంలో సురిగి శ్రీనివాస్, విజయ్, శోభన్, రాము, సున్ను లు పాల్గొన్నారు