లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య ద్రావణం పంపిణీ

Published: Tuesday February 09, 2021
వెల్గటూర్, మార్చ్ 07 (ప్రజాపాలన):
వెల్గటూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వెల్గటూరు పి.ఆర్.ఓ నక్క సురేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలకు పారిశుద్ధ్య సంబంధం ద్రావణాన్ని పంపిణీ చేశారు. వెల్గటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాలకు 15 లీటర్ల  హైపో క్లోరైట్ ద్రావణాన్ని అందించారు. ఆదర్శ పాఠశాలకు 10 లీటర్లు, స్తంభంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు ఐదు లీటర్ల చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమాలు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మద్ది మురళీధర్, కార్యదర్శి వైద్య వెంకటేశ్వర్లు, కోశాధికారి గట్ల రాజేందర్, ఉపాధ్యక్షులు సిరిపురం తిరుపతి, నక్క సురేష్, సంకోజు నరేష్, బండమీది గోపి తదితరులు పాల్గొన్నారు.
 
Attachments are