ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం

Published: Monday April 03, 2023

మధిర ఏప్రిల్ 2 ప్రజా పాలన ప్రతినిధి; షేక్ ఆర్షద్ పుట్టినరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ లోని మతిస్థిమితం కోల్పోయిన వారికి వృద్ధులకు వికలాంగులకు మహోన్నతమైన అన్నదానం నిర్వహించారు. వారి తల్లిదండ్రులు నాగుల్ మీరా అల్లాబి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రత్న రాజు సైదులు నాగుల్ మీరా నాగేశ్వరరావు దుర్గాప్రసాద్ విచ్చేసి కేకు కత్తిరించి పండ్లు మరియు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ఆర్షద్ కు అభినందనలు తెలియజేస్తూ మహోన్నతమైన అన్నదానం నిర్వహించిన వారి తల్లిదండ్రులు నాగులమీరా అల్లాభికి ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం నిర్వాహకులు డా.దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్ కె కృతజ్ఞతలు తెలియజేశారు.