గాంధీ నగర్ లో దొంగతనం సుమారు 5 లక్షలు విలువు గల బంగారం వెండి ఆభరణాలు చోరీ.

Published: Friday January 06, 2023
వెంటనే స్పందించిన బూర్గంపహాడ్ ఎస్ఐ  పి సంతోష్ ..
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న మండల ప్రజలు. ఈరోజు  సారపాక పంచాయతీలో గాంధీనగర్ గ్రామంలో సారపాక పంచాయతీలో పనిచేస్తున్న యాకోబు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగి  సుమారు 5 లక్షలు విలువచేసే బంగారు వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు సమాచారం.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇంటి యజమాని .స్పందించిన బూర్గంపహాడ్ ఎస్ఐ పి సంతోష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని జాగిలాన్ని రంగంలో దించిన ఎస్సై సంతోష్  వివరాలు సేకరిస్తున్న పోలీస్ బృందం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మండలంలో వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న బూర్గంపాడు మండల ప్రజలు.