ముమ్మరంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమం

Published: Friday May 20, 2022
బోనకల్, మే 19 ప్రజా పాలన ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పరిధిలోని గోవిందపురం (ఏ) గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టిడిపి జిల్లా నాయకులు భాగం రమేష్ ప్రారంభించారు. గ్రామానికి చెందిన భాగం రాకేష్ ,కావూరి శంకర్ రావు ,కావూరి జనార్దన్ రావు, సుందర్ రావు,బొబ్బిళ్ళ వెంకయ్య,వెంకట్రావమ్మా లకు పార్టీ సభ్యత్వం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి మరీదు బరకయ్య, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.