విఆర్ఎ ల సమ్మె కు సంఘీభావం తెలిపిన వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులు

Published: Friday July 29, 2022

బోనకల్, జూలై 28 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రము లో విఆర్ఎల సంఘం ఆధ్వర్యంలో నాలుగవ రోజు జరుగుతున్న సమ్మె కు బోనకల్ మండల వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కే జమాలుద్దీన్ గురువారం సంఘీభావం ప్రకటించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ విఆర్ఎలకు పిఆర్పి పే స్కేలు వెంటనే అమలు చేయాలని, వీఆర్ఏ ల వ్యవస్థను కక్షగట్టి నిరంకుశభావంతో ఇచ్చిన హామీలను నిర్వీర్యం చేస్తున్నారని, వాటిని వెంటనే అమలు చేయాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వారు మండిపడ్డారు. అదేవిధంగా అర్హులైన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని , వారి న్యాయమైన సమ్యసలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.