మల్లికార్జున్ నగర్ నాలలో చెత్త చెదారం తొలగింపు

Published: Wednesday September 29, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 28, ప్రజాపాలన ప్రతినిధి : భారీగా కురుస్తున్న వర్షాలతో హెచ్ఎంటి నగర్ చెరువు కింద ఉన్న నాలా పొంగి చిల్కానగర్ డివిజన్లోని మల్లికార్జున నగర్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ మేరకు  కాలనీవాసులు సుందర్, ఉపేందర్ మరియు అశోక్ చారి స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కు వరద నీరు గురించి తెలియజేయగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ ఉప్పల్ జిహెచ్ఎంసి ఈ ఈ నాగేందర్ తో మాట్లాడి నాలలో చెత్త ఇసుకను తొలగించడం జరిగింది. వెంటనే స్పందించినందుకు కార్పొరేటర్ కు కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు. వర్షాలు అధికంగా పడుతున్నాయని  జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేటర్  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి, టీఅర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, వీబీ నర్సింహ, డివిజన్ ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, సత్యనారాయణ రెడ్డి, బింగి శ్రీనివాస్, శ్రీకాంత్, శ్యామ్, బాలు కాలనీ వాసులు అశోక్ చారి, సుందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.