గ్రామ అభివృద్దికై మేము సైతం ఫౌండేషన్ విరాళం

Published: Tuesday October 12, 2021
కోరుట్ల, అక్టోబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలము లోని మాదాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేష్ పిలుపు మేరకు శాంతి భద్రతల నిమిత్తం సీసీ కెమెరాల అమర్చుటకు మేము సైతం పౌండేషన్ మాదాపూర్ సభ్యులు, మాధపూర్ గ్రామంలో 1,25,000/- రూపాయలను గ్రామ పంచాయితీ కి విరాళంగా ప్రకటించారు.అందులో బాగంగా సోమవారం రోజున సర్పంచ్ దారిషేట్టి రాజేష్ కి ముందుగా 50,000/- రూపాయలు అందజేసిన దారిషెట్టి రవీందర్. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం గ్రామానికి సీసీ కెమెరాలు విరాళంగా ఇచ్చిన మేము సైతం పౌండేషన్ కి గ్రామస్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగన్ పల్లి సర్పంచ్ దుంపల నర్సు రాజా నర్సయ్య, కల్లూరు సర్పంచ్ వనతడుపుల అంజయ్య, పైడిమడుగు సర్పంచ్ ధమ్మ భీమ రెడ్డి లు పాల్గొన్నారు.