వైద్యులకు సన్మానం

Published: Friday July 02, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది డాక్టర్ జ్యోతికి మరియు సిబ్బందికి వెంకటాపురం గ్రామ సర్పంచ్ కొత్త నరసింహ సతీమణి వాసవిలు పూలమాల శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనాతో పోరాడుతున ప్రజలను  కాపాడుతున్న ఆశా కార్య కర్తలు, డాక్టర్లు వారు చేసిన సేవలు దేవుళ్లతో సమానమని అదే విధముగా వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వార్డు మెంబర్ జక్కల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.