జీతాలు లేక కార్మికుల ఆవేదన
Published: Wednesday August 25, 2021
బాలాపూర్, ఆగస్టు 24, ప్రజాపాలన ప్రతినిధి : జీతాలను సరైన సమయంలోని ఇవ్వాలినీ, సెలవుదినాలను అమలు చేయాలని మీర్ పేట్ కమిషనర్ కు హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కార్మికులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ...... ప్రతి నెల సమయానికి జీతాలు రావడం లేదు..? జులై జీతాలు... ఇప్పటికీ ఆగస్టు 24 తారీఖునై కూడా జీతాలు రాలేదు...! అదేవిధంగా కార్మికులకు పి.ఎఫ్ ని ఏజెన్సీ చెల్లించడం లేదు.. నెలలో సెలవు రోజులు అమలు చేయడం లేదు... భద్రతా పరికరాలు, ఐడి కార్డులను వెంటనే అమలు చేయాలని మీర్ పేట్ కమిషనర్ కు 30 మంది కార్మికులు ఆవేదన వ్యక్తపరిచారు. ఇవి తొందరలో అమలు చేసే పరిష్కరించాలని మీర్ పేట్ ఇంచార్జ్ కమిషనర్ లేకపోవడం వల్ల మేనేజర్ వెంకట రెడ్డి కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే 30 మంది కార్మికులు పాల్గొన్నారు.
Share this on your social network: