ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Thursday January 27, 2022
మేడిపల్లి, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప్పల్ సీఐ ఆర్.గోవింద్ రెడ్డి, ట్రాఫిక్ సిఐలు పార్థసారథి, నర్సింగ్ యాదయ్య ఎస్ఐ జయరాం, ఎఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ ప్రతి యేటా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి.వెంకట్రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.నరోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎం. సురేష్ కుమార్, పి సాగర్, ఏ.వి. శ్రీధర్ రావు, కోశాధికారి ఆర్ యాదగిరి గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శులు ఎం అశోక్, దాస రాజు, సంయుక్త కార్యదర్శి జి.శివాజీ, సలహాదారులు కె.చంద్రమౌళి, డి.సురేష్, ఎం రామ్ ప్రసాద్ శర్మ, కే.శ్రీనివాస్, ముత్యం రెడ్డి, సీనియర్ జర్నలిస్టు వి. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.