పలు గణపతి మండపాలు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పరేటర్ గంగాధర్ రెడ్డి

Published: Friday September 02, 2022
శేరిలింగంపల్లి- ప్రజా పాలన /సెప్టెంబర్ 1 :నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి, ఎన్టీఆర్ నగర్ లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పలు గణపతి మండపాల వద్ద ముఖ్యఅతిథిగా పాల్గొని విగ్నేశ్వరుడికి మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కరుణా, కటాక్షం ప్రజలపై తప్పక ఉంటుందన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రులను మట్టి విగ్రహాలతోనే పూజా కార్యక్రమాలు జరుపుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు, గణేష్ కమిటీ సభ్యులు, భక్తులు, గోపనపల్లి, ఎన్టీఆర్ నగర్ గ్రామం వాసులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.