రెండో పంటకు నీరు అందించి రైతులను ఆదుకోవాలి. ....తాళ్ళపెల్లి రాజేశ్వర్
Published: Monday December 19, 2022
జన్నారం, డిసెంబర్ 18, ప్రజాపాలన: నిర్మల్ జిల్లా నారాయణరెడ్డి ప్రాజెక్టు కింది రైతులైన జన్నారం దండేపల్లి హాజీపూర్ మండలాల రైతులకు రెండో పంటకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని ఆదివారం తెలుగుదేశం పార్టీ అదిలాబాద్ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కడెం ఆయకట్టు కింద రైతులకు నీరు అందించాలన్నారు. మొదటి పంటలో అధిక వర్షాలు పడి పంటలు పూర్తిస్థాయిలో పండలేదని ఆయన తెలియజేశారు. కడెం ఆయకట్టు నుంచి రెండో పంటకు నీరు అందిస్తూ రైతులు ఆదుకోవాలని ఆయన కోరారు.
Share this on your social network: