బహుజనులను ఏకంచేసి బి ఎస్ పి పార్టీ ని ప్రతిష్ట చేస్తాం

Published: Saturday October 02, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : శుక్రవారం రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు గ్యార మల్లేష్ ఆధ్వర్యంలో ఎం ఎం గార్డెన్ లో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ ఇంచార్జ్ పల్లాటి రాములు హాజరైయ్యారు. నూతన కమిటీ లు ఏర్పాటు చేయడమైనది ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ గా ఎర్ర ఇబ్రమ్ ఎన్నుకున్నారు. ఇబ్రహీంపట్నం మండల మహిళ కన్వీనర్ గా కంబాలపల్లి రజిని కిషన్ నియమితులయ్యారు ఆదిబట్ల మున్సిపాలిటీ అధ్యక్షులుగా J.అంజయ్య  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులుగా చింతపట్ల నగేష్ కి అసెంబ్లీ కాంసెన్సీ అధ్యక్షులు గ్యార మల్లేష్ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ధార యాదగిరి, కోశాధికారి కంబాలపల్లి శాంత, కొండ్రు రఘుపతి, కంబాలపల్లి కిషన్, గణేష్, మహేష్ మహారాజ్, గడ్డం రమేష్, ప్రేమ్, ఎర్ర యాదగిరి, గ్యార మహేష్  పాల్గొన్నారు.