ఓపెన్ టు ఆల్ వాలీబాల్ విజేత విజయవాడ జట్టు
Published: Tuesday February 07, 2023
మర్పల్లి మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు ఎన్.రవీందర్
వికారాబాద్ బ్యూరో 06 ఫిబ్రవరి ప్రజాపాలన : ఎస్కెఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా విజయవాడ జట్టు నిలిచిందని
మర్పల్లి మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు ఎన్.రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజేతగా నిలిచిన జట్టుకు మొదటి బహుమతి 31,000 రూపాయలు, ద్వితీయ జట్టు పంచలింగాల్ కు 15, 000 తృతీయ జట్టు ఖమ్మంకు 8000 రూపాయలు నగదు బహుమతి తో పాటు శీల్డులు కూడా అందజేశామని స్పష్టం చేశారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ బట్టు లలిత రమేష్ పిఎసిఎస్ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ మండల అధ్యక్షులు సురేష్ ఎంపీటీసీ స్వప్న సురేష్ సర్పంచులు సురేందర్ రెడ్డి ఇందిర అశోక్ శంకర్ ధరమ్ సింగ్ సీనియర్ నాయకులు పాండురంగారెడ్డి రవీందర్ రెడ్డి యాదవ రెడ్డి పార్టీ కార్యకర్తలు వివిధ సంఘాల యువజన నాయకులు పాల్గొనడం జరిగింది
Share this on your social network: