వర్ధంతి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే.

Published: Monday April 18, 2022
బెల్లంపల్లి ఏప్రిల్ 17 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి ఎంపీడీఓ గా పనిచేస్తున్న డి.రాజేందర్ భార్య కీ"శే" రాజేశ్వరి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి బెల్లంపల్లి లోని తన స్వగృహానికి ఆదివారం నాడు విచ్చేసి, నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,  చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ టి.సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, మండల తెరాస పార్టీ అధ్యక్షుడు గణేష్ గౌడ్, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.