తెరాస నాయకున్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Published: Thursday November 03, 2022
బెల్లంపల్లి నవంబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గ  తాండూరు మండలం మాదారం గ్రామానికి చెందిన  తెరాస నాయకులు అశోక్  అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స తీసుకుంటుండగా, బుధవారం  వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని  పరామర్శించిన  బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య.
ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దత్తుమూర్తి , మాజీ జడ్పీటీసీ మంగపతి సురేష్ , తాండూరు గ్రామపంచాయతీ కో ఆప్షన్ సభ్యుడు రాంచందర్ , తదితరులు పాల్గొన్నారు .