జాతీయ సమైక్యత వారోత్సవాలను జయప్రదం చేయండి కాంగ్రెస్ పార్టీ మధిర సెప్టెంబర్ 17 ప్రజా పాలన ప్ర

Published: Friday September 16, 2022
మధిర మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ_ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత వార్షికోత్సవంలో భాగంగా విజయవంతం చేద్దాం రండి తరలి రండి అంటూ మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూమండల  పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్ మాట్లాడుతూ
రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ కార్యక్రమాన్ని   తెలంగాణ పిసిసి అధ్యక్షుడు *రేవంత్ రెడ్డి* సీఎల్పీ లీడర్ *మల్లు భట్టి విక్రమార్క*  పిలుపుమేరకు  ఈ నెల 16 నుండి 18 వరకు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నేడు ఉదయం 11 గంటలకు వైయస్సార్ చౌరస్తా నుండి జరగనున్న ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* కాంగ్రెస్ సీనియర్ నాయకులు *నిడమనూరు వంశీ*  పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పాల్గొన్నారు