ఆరోగ్యం కోసం అరటిపండ్ల పంపిణీ

Published: Monday February 15, 2021
మధిర, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: కుందా సావిత్రి సేవాసమితి భవనములో మధిర బాబ్లా గారు మరియు యార్లగడ్డ నరసింహారావు గారి ఆర్థిక సహకారంతో ఉచిత హోమియో వైద్యశాల డాక్టర్లు S.హారిక గారి చేతుల మీదగా అరటి పండ్లు పంపిణీ చేశార. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని, ప్రతి ఒక్కరు రోజూ తినే ఆహారంలో పండ్లు తీసుకుంటే చక్కటి పోషక విలువలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్య శాల నిర్మాణ దాతలు కుందా నాగభూషణం గారు హోమియో వైద్యశాల ఆర్గనైజర్ సంక్రాంతి శ్రీనివాసరావు, డాక్టర్ కామేశ్వరరావు వాలంటీర్లు కుటుంబరావు, హరీష్, చేడే శ్రీనివాస్, పోతినేని మురళీకృష్ణ, హరీష్, నందిని, రాజేశ్వరి ,త్రివేణి తదితరులు పాల్గొన్నారు.