ఆరోగ్యం కోసం అరటిపండ్ల పంపిణీ
Published: Monday February 15, 2021
మధిర, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: కుందా సావిత్రి సేవాసమితి భవనములో మధిర బాబ్లా గారు మరియు యార్లగడ్డ నరసింహారావు గారి ఆర్థిక సహకారంతో ఉచిత హోమియో వైద్యశాల డాక్టర్లు S.హారిక గారి చేతుల మీదగా అరటి పండ్లు పంపిణీ చేశార. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని, ప్రతి ఒక్కరు రోజూ తినే ఆహారంలో పండ్లు తీసుకుంటే చక్కటి పోషక విలువలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్య శాల నిర్మాణ దాతలు కుందా నాగభూషణం గారు హోమియో వైద్యశాల ఆర్గనైజర్ సంక్రాంతి శ్రీనివాసరావు, డాక్టర్ కామేశ్వరరావు వాలంటీర్లు కుటుంబరావు, హరీష్, చేడే శ్రీనివాస్, పోతినేని మురళీకృష్ణ, హరీష్, నందిని, రాజేశ్వరి ,త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: