బిజేపి పార్టీ కార్యాకర్తలపై అమానుషం.

Published: Monday May 02, 2022
మండల బిజేపి అధ్యక్షుడు గోలి చందు
జన్నారం రూరల్, మే 01, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో మిర్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చేసిన నిరసనలో బిజేపి పార్టీ కార్షాకర్తల పై టిఆర్ఎస్ అనుచరులు చేసిన దాడి అమానుషం అని మండల బిజేపి పార్టీ అధ్యక్షుడు గోలి చందు అన్నారు. అదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నిన్న చెన్నూరులో మిర్చి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ మేరకు చెన్నూరు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి అందుగుల శ్రీనివాస్ నియోజకవర్గంలోని రైతులను పరామర్శించి కష్టసుఖాలను తెలుసుకున్నారని అయన అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నారకులపై దాడిచేశారని ఇందులో చేన్నూర్ నాయుడు అందుగుల శ్రీనివాస్ పై దాడి జరిగిందని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదును చేపట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.