రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ.
మధిర ఫిబ్రవరి 27 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుందని నాగార్జునసాగర్ డ్యాం నిండా నీళ్లు ఉన్నా రైతులకు నీళ్లు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వ ఉంది.దాల్వా వరి, మొక్కజొన్న పంటలు వేయమని ప్రకటించి. రైతులు వరి, మొక్కజొన్న, మిరప చేలు వేసి పెట్టుబడి మొత్తం పెట్టిన తర్వాత నీరు అందక ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.సాగర్ నిండా నీళ్లు ఉన్నా వారానికి ఒక కాలువ అని పెట్టి కింద ఉన్న నియోజకవర్గానికి నీరు అందించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు.కాలువలు వదిలేది, ఆపేది సంబంధిత కింద స్థాయి అధికారులకు కూడా తెలవని పరిస్థితి, మొక్కజొన్న, వరి మిరప తోటలు నెర్రలు కొట్టి ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి.. వెంటనే ఎన్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్లు వదిలి రైతులని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు అనంతరం ప్రీతి ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలిఅద్దంకి రవికుమార్_
Share this on your social network: