నాగేంద్ర ఐటిఐ కళాశాలలో కాన్విగేషన్ శర్మని మధిర

Published: Tuesday September 20, 2022

సెప్టెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు నాగేంద్ర ఐటిఐ కళాశాలలో డీజీఈటి ఆదేశాల ప్రకారం విద్యార్థులకు కాన్విగేషన్ శర్మని కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ నాగేంద్ర ఐటిఐ కళాశాల కరస్పాండెంట్ పాటిబండ్ల సత్యం బాబు, కళాశాల ప్రిన్సిపాల్ వాసిరెడ్డి నాగేంద్రమణి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్నికల్ రంగంలో ఉన్న అవకాశాలను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకొని ఉద్యోగాలు సంపాదించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నీరుకొండ మురళి దోర్నాల ప్రమోద్ వేల్పుల సతీష్ ముచ్చింతల కృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు