ఇన్చార్జి ఈవో గా బాధ్యతలు చేపట్టిన రాహుల్

Published: Tuesday March 14, 2023

చెన్నారం, మార్చ్ 13, ప్రజాపాలన: మండలంలోని పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గత కొన్ని నెలలుగా ఈవో పోస్ట్ ఖాళీగా ఉండగా ఇన్చార్జ్ ఈవోగా రాహుల్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పూర్తి ఇంచార్జ్ ఈవోగా బాధ్యతలు ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామపంచాయతీలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పూర్తి విచారణ చేయడం జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీ వేతనం పెంచి విషయంలో ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆ గ్రామ సర్పంచ్ జక్కు భూమేష్ ఈవోగా నూతల బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ను అభినందించారు. అదేవిధంగా మండలంలోని గ్రామపంచాయతీ పరిధి శ్రీలంక కాలనీలో రోడ్లను నిర్మించాలని ఆ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు భూమేష్ కు ఆ కాలనీకి చెందిన సిపిఎం నాయకుడు కూకటికారి బుచ్చన్న వినతి పత్రం అందించేసారు. గ్రామ శ్రీలంక కాలనీలో రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందన్నారు. కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం జరిపి గ్రామ కాలనీ ప్రజల అవసరాలు తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్మార్వో రాజన్న, సిపిఎం నాయకులు కుకుటికారి బుచ్చన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు