సీఎల్పీ నేత భట్టి పాదయాత్రకు మాజీ ఎంపీ సంఘీభావం

Published: Thursday April 21, 2022
మధిర ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి : మండలం పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకై  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు బుధవారం మధిర మండలం అంబర్ పేటకు వచ్చి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. గ్రామంలో భట్టివిక్రమార్క గారితో కలిసి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు. నిదానపురం దెందుకూరు ఖమ్మంపాడు చిలుకూరుగ్రామంలోలో భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం జనంప్రజాసమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 26వ రోజు బుధవారం మండలం గ్రామానికి చేరుకున్న సందర్భంగా  కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున కదిలివచ్చి  భట్టి విక్రమార్కకి ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. డప్పు కళాకారుల బృందం విన్యాసాలు, కోలాటం మహిళల నృత్యాలతో హోరేత్తింది. సబ్బండ వర్గాల ప్రజలు కదిలి వచ్చి భట్టి అడుగులో అడుగులు వేస్తూ పీపుల్స్ మార్చ్ లో కదం తొక్కారు. అడుగడుగునా ప్రజలు భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు ఈ కార్యక్రమంలో కిషోర్ బాలరాజు అధ్యక్షులు రవి నవీన్ రెడ్డి రామారావు దుంప వెంకటేష్ రెడ్డి విజయ్ బోడేపూడి గోపి బుజ్జి రామ్ వేణు శ్రీనివాస్ రెడ్డి రమణ గుప్తా గ్రామ సర్పంచ్ కార్యకర్తలు అనుబంధ సంఘాలు తదితరులు పాల్గొన్నారు