నూతన ఎస్సై కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ యువ నాయకులు బిపి నాయక్
Published: Thursday November 18, 2021
బోనకల్, నవంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : స్థానిక పోలీస్ లో నూతన తొలి మహిళ ఎస్సైగా తేజావత్ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి యువనేత ఎన్ఆర్ఐ బిపి నాయక్, ఈ సందర్భంగా బీపీ నాయక్ మాట్లాడుతూ బోనకల్ పోలీస్ స్టేషన్ చరిత్రలో మొట్టమొదటి మహిళా సబ్ ఇన్స్పెక్టర్ గా వచ్చిన కవిత ని బోనకల్ ఆడపడుచుగా అభివర్ణించి చీరను బహూకరించి గ్రామ కుటుంబంలో ఆహ్వానించారు. శాంతి భద్రతలను కాపాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి బోనకల్ మండల అధ్యక్షులు గుగులోత కిషన్ నాయక్, భూక్యారమేష్ నాయక్, ఉపేంద్ర ధనుష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: