సీపీఐ సీనియర్ కార్యకర్త మృతి

Published: Saturday October 08, 2022
బోనకల్, అక్టోబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని మోటమర్రి గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ కార్యకర్త వంగాల వెంకటేశ్వర్లు (72) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. మృతదేహానికి సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు పార్టీ జెండా కప్పి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతునికి ముగ్గురు కుమారులు ఉన్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ శాఖ కార్యదర్శి బుర్రి నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు వంగాల కృష్ణ, మరీదు మల్లయ్య, మర్రి శ్రీను, మాజీ ఎంపీపీ చిట్టిమోదు నాగేశ్వరరావు, కేతినేని నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు బంధం నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు మందా చిన్నబ్బాయి తదితరులున్నారు.