న్యూస్ 2 రెండు ఫోటోలు పెట్టండి సార్

Published: Monday March 13, 2023

 

ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి

బాటసింగారంలో బంటన్నకు బతుకమ్మలతో స్వాగతం...

ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 50 వ రోజు పాదయాత్రతో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బాటసింగారం గ్రామానికి చేరుకున్న యువనేత  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటీ) కి మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు.
గ్రామంలో గడపగడపకు తిరిగిన బంటీ  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించి, వారి సమస్యలను  కావలసిన అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు.సాయంత్రం గ్రామ చౌరస్తాలో నిర్వహించిన సభలో ముఖ్యఅతిధులుగా బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి , రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్  పాల్గొన్నారు.ఎమ్మెల్యే  మాట్లాడుతూ...మహిళా భవనం నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు, బాటసింగారం లాజిస్టిక్ పార్కులో భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ, గ్రామంలోకి బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు, బాటసింగారం కొత్త రోడ్డు(శివాజీ విగ్రహం) నుండి కొత్తగూడెం వరకు డబుల్ రోడ్డును త్వరలోనే మంజూరు ఎమ్మెల్యే చేస్తామన్నారు.