మధిర పట్టణంలో పలు అభివృద్ధి పరిశీలనజడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు విస్తృత పర్యటన

Published: Wednesday February 02, 2022
మధిర ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుపట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జడ్పీ చైర్మన్ పట్టణ సుందరికారణ లో భాగంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జ్, అంబేద్కర్ సెంటర్ నందు జరుగుతున్న పనుల పరిశీలన పలు సూచనలు చేసిన జడ్పీ చైర్మన్ కమల్ రాజు మధిర పట్టణంలో మంగళవారం నాడు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ. ముఖ్యంగా మధిర పట్టణ సుందరికారణ లో భాగంగా రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ మరియు అంబేద్కర్ సెంటర్ నందు జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు అలానే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ మీద వేస్తున్న పలువురు ప్రముఖుల చిత్రపటాలను బ్రిడ్జి పై వేసే సందేశాత్మక డిజైన్స్ ను పరిశీలించారు.. మధిర పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని పట్టణ సూదరికారణ ద్వారా మధిర మున్సిపాలిటీ రూపురేఖలు మరనున్నాయని ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, కమిషనర్ రమాదేవి, డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అప్పారావు, కౌన్సిలర్ ఇక్బల్, మేడికొండ కిరణ్, గద్దల నాని, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.