కష్టపడి చదవండి ఉన్నత శిఖరాలకు ఏదగండి, విద్యార్థులతో ఎమ్మెల్యే కందాళ కాసేపు

Published: Thursday March 04, 2021
పాలేరు (ప్రజాపాలన ప్రతినిధి) మార్చి 3: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కూసుమంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి,  ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులతో సంభాషించారు, వారి సమస్యలు అడిగి స్కూల్లో వసతులన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా ఏం కావాలి అని అడిగి తెలుసుకున్నారు  విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు  కష్టపడి చదవండి ఉన్నత ఉన్నత శిఖరాలకు ఎదగాలి. మంచి ఉద్యోగులు పొంది తల్లిదండ్రులకు. గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే గారు విద్యార్థిగా ఉన్నప్పుడు  అనుభవాలు విద్యార్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్. పార్టీ మండల అధ్యక్షులు షాట్ల పరశురాం, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, కూసుమంచి. ఎంపీపీ. బి. శ్రీనివాస్, ఆత్మ  చైర్మన్. రామ సాయం బాలకృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..