భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవం జయప్రదం జేయాలి.
Published: Wednesday April 06, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 5 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని వైష్ణవి గార్డెన్స్లో భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండల స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం దండే శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించారు. రేపు జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం గ్రామ, గ్రామాన మండల స్థాయిలో, మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలని, మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో అత్యధిక బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కార్యకర్తలకు బిజెపి పార్టీ వనపర్తి జిల్లా ఇన్చార్జి బోసుపల్లి ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు నాయిని సత్యనారాయణ, ముత్యాల భాస్కర్, యాదగిరి రెడ్డి లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మొగిలి గణేష్, విష్ణువర్ధన్ రెడ్డి,మేకల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు రావుల మల్లేష్, వేణుగోపాల్ రెడ్డి, మోర్చా అద్యక్షులు బాబులు, శేఖర్ రెడ్డి, శ్వేత, విఠల్ రెడ్డి, బాల శివుడుగౌడ్ మండల కార్యదర్శులు బాలకిషన్, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: