దండేపల్లి లో డ్రాగన్ కుంగ్ ఫు పోటీలు

Published: Monday October 11, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 10, ప్రజాపాలన : డ్రాగన్ స్వాడ్ కుంగ్ ఫు అకాడమీ. ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో మాస్టర్ బొడ్డు. రాయమల్లు.సిహెచ్. రాజేందర్. కె మహేష్ లు బెల్టు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దండేపల్లి ఎస్ ఐ తాళ్ల.శ్రీకాంత్ పాల్గొన్నారు. అనంతరం ఎస్ ఐ మాట్లాడుతూ డ్రాగన్ స్వాడ్ కుంగ్ ఫు నేటి యూవతరానికి ఎంతో ఆత్మరక్షణ ఉంటుంది అన్నారు. కుంగ్ ఫు పోటీలో  విద్యార్థుల కు బెల్ట్ తో పాటు గోల్డ్.సిల్వర్ మెడల్ ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం ఎస్ఐకి మాస్టర్స్ విద్యార్థులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు