కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి మున్సిపల్ చైర్మన్

Published: Thursday March 02, 2023
మధిర మార్చి ఒకటి ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథ
మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత పాల్గొని ప్రజలు కంటి వెలుగును కార్యక్రమాలను సద్విని చేసుకోవాలని ఆమె కోరారుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ఈరోజు మధిర మున్సిపాలిటీలోని 21వ వార్డు నందు మున్సిపల్ చైర్మన్ మొండితోక లత ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు గ్రామీణ ప్రాంతాల వారు పేదవారు కంటి చూపు లేక ఆసుపత్రికి వెళ్లి చూయించుకునే ఆర్థిక స్తోమత లేక బాధపడుతున్నటువంటి వారికి కోసం వైద్యులు గ్రామానికి వెళ్లి కళ్ళు పరీక్ష చేసి సమస్యకు సంబంధించిన కళ్ళజోడు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ తోనే సాధ్యమని అన్నారు  ఈ కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ ఎర్రగుంట్ల లక్ష్మి మున్సిపల్ కమిషనర్ రమాదేవి  ఆర్ సి ఎం చర్చి ఫాదర్ శాంత కుమార్ డాక్టర్ పురుషోత్తం  ప్రభుదేవ్ తదితరులు పాల్గొన్నారు