మాస్క్ ధరించు...కరోనాను తరిమికొట్టు

Published: Tuesday April 20, 2021
చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 ప్రజాపాలన : కంటికి కనపడని శత్రువుతో చేసే యుద్ధంలో నెగ్గాలంటే ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని చేవెళ్ల ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి హితవు పలికారు. ఆదివారం వికారాబాద్ జిల్లా జిఆర్ఆర్ ముస్లిం యూత్ వింగ్ నాయకులు మున్సపల్ కోఆప్షన్ నెంబర్ అఫ్జల్ పాష ( షకీల్), ఆలంపల్లి సిద్ధిక్, గరీబ్ నగర్ ఎజాజ్ ల ఆధ్వర్యంలో తయారు చేసిన ఫేస్ మాస్క్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ..తాను క్షేమంగా ఉంటేనే తమ కుటుంబం కూడా సుఖంగా, సంతోషంగా, పిల్లాపాపలతో హాయిగా జీవనం కొనసాగిస్తారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల క్షేమాన్ని కోరే విధంగా ప్రతి ఒక్కరూ కరోన పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ పాషా (షకీల్) మాట్లాడుతూ.. చేవెళ్ళ పార్లమెంట్ ప్రజల క్షేమం కోరి ఎంపి రంజిత్ రెడ్డి సౌజన్యంతో మైనారిటీ వింగ్ యూత్ మాస్కులను తయారు చేసి ప్రజలకు పంపిణీ చేయడం శుభపరిణామమని కొనియాడారు. సామాజిక సేవలో మైనారిటీ వింగ్ యూత్ ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. ప్రజల కష్టసుఖాలలో మైనారిటీ వింగ్ చేదోడువాదోడుగా నిలుస్తుందని వివరించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మా దృష్టికి తెస్తే మా సహాయ.సహకారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.