మండల పరిషత్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
Published: Tuesday March 23, 2021
మధిర, మార్చి22, ప్రజాపాలన ప్రతినిధి : మధిర ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం ఎంపీపీ మొండెం లలిత మాట్లాడుతూ మండల పరిస్థితులకు ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో రూ.500 కొట్ల నిధులు కేటాయించిన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో ఈ నిధులు ప్రతి పంచాయతీకి ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుడుముల విజయ భాస్కర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కార్యదర్శి బొగ్గులు భాస్కర్ రెడ్డి, కనుమూరి వెంకటేశ్వరావు,అల్లినగరం ఎంపీటీసీ చిలక బత్తిని జయరాజు, మాటూరు ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వరరావు, సిరిపురం ఎంపిటిసి నండ్రు కుమారి, ఆత్కూరు ఎంపీటీసీ పాండు రంగారావు, కుమారి,ఎస్.డీ. కాదర్ పాల్గొన్నారు.
Share this on your social network: